మన టాలీవుడ్ డైరెక్టర్లలో ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న డైరెక్టర్లలో శేఖర్ కమ్ముల( Sekhar Kammula ) ఒకరు.ఈయన ముందు నుండి డిఫరెంట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు.
కుటుంబం మొత్తం కలిసి కూర్చుని చూసే విధంగా ఈయన సినిమాలు ఉంటాయి.ఒక హ్యాపీ డేస్.
.ఒక ఫిదా.ఒక లవ్ స్టోరీ.ఇలా ఎన్నో సినిమాలు ఈయన ఖాతాలో సూపర్ హిట్ అయ్యాయి.

ఈ సినిమాలు ఎన్నిసార్లు చూసి బోర్ కొట్టవు.ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ను సెట్ చేస్తున్నారు.కింగ్ నాగార్జున, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ( Dhanush ) చేసి బ్లాక్ బస్టర్ అందుకుని తెలుగులో కూడా ఫాలోయింగ్ పెంచుకున్నాడు.

ఇక ఇప్పుడు ఈ సినిమాను స్టార్ట్ చేయనున్నారు.ప్రస్తుతానికి ”D51” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న ధనుష్ సరసన హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది.ఇటీవలే నాగార్జున( Nagarjuna ) కూడా ఈ సినిమాలో భాగం అయినట్టు తెలిపారు.
దీంతో ఇది మల్టీ స్టారర్ అని తేలిపోయింది.దీంతో ఇప్పుడు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇదిలా ఉండగా ఈ సినిమా స్టోరీ గురించి ఇప్పుడొక వార్త వైరల్ అయ్యింది.ఈ సినిమాను శేఖర్ కమ్ముల ఒక రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ప్లాన్ చేసినట్టు టాక్.
పీరియాడిక బ్యాక్ డ్రాప్ లో పొలిటికల్ డ్రామాగా ప్లాన్ చేస్తుండగా ఈ కాంబో ఎలా హిట్ అవుతుందో చూడాలి.ఇక ఈ సినిమాను అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ వారు LLP బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.







