ఉప్పెనలా దూసుకొస్తానంటున్న దేవిశ్రీ ప్రసాద్

మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న మరో యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న మొదటి చిత్రం ఉప్పెన ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ఇప్పటికే షూటింగ్‌లో దూసుకుపోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

ఈ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటంతో మ్యూజిక్ పరంగా ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి అంటున్నారు ప్రేక్షకులు.

కాగా ఉప్పెన సినిమాతో తన సత్తా మరోసారి రుజువు చేస్తానంటున్నాడు దేవిశ్రీ ప్రసాద్.ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాతో అలరించిన దేవిశ్రీ ప్రసాద్, గతకొంత కాలంగా బ్లాక్‌బస్టర్ మ్యూజిక్ అందించడంలో విఫలమవుతున్నాడు.

దీంతో దేవిశ్రీ ప్రసాద్ సంగీతంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కాగా ఉప్పెన సినిమాతో తన పూర్వ వైభవాన్ని పొందుతానని దేవిశ్రీ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

Advertisement

ఉప్పెన సినిమాను బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తుండగా తమిళ నటుడు విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమా తరువాత దేవిశ్రీ ప్రసాద్ మరోసారి సుకుమార్-బన్నీ సినిమాకు సంగీతం అందించనున్నాడు.

ఏదేమైనా దేవిశ్రీ ప్రసాద్ ఉప్పెన సినిమాతో ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు