మోదీ వస్తేనే తెలంగాణ అభివృద్ధి..: బండి సంజయ్

మంత్రి కేటీఆర్ పై బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ప్రధానమంత్రి మోదీ పర్యటనతో హైదరాబాద్ ప్రగతిభవన్ లో భూకంపం మొదలైందని తెలిపారు.

 Development Of Telangana Only If Modi Comes..: Bandi Sanjay-TeluguStop.com

కల్వకుంట్ల కుటుంబంలో లొల్లి స్టార్ట్ అయిందన్న బండి సంజయ్ కేటీఆర్ సీఎం అభ్యర్థి అయితే ఎమ్మెల్యేలు బయటకొస్తారన్నారు.కేటీఆర్ భాషను చూసి తెలంగాణ సిగ్గు పడుతోందని చెప్పారు.

ఎక్కడైనా భారతదేశానికి గుర్తింపు దక్కుతుంది అంటే దానికి కారణం మోదీ అని చెప్పారు.మోదీ వస్తేనే తెలంగాణలోనూ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.

కేసీఆర్ కుటుంబం ప్లాన్ ప్రకారం మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.ఈ క్రమంలోనే తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.

అయితే కేసీఆర్ కుటుంబం చేస్తున్న వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube