సాయం చేసినవాడి పై కేసు పెట్టిన ఢిల్లీ జంట!

కరోనా టైంలో అన్ని రంగాలు స్తంభించిపోయాయి.దీనిలో తను నడిపే ఢాబా వ్యాపారం కూడా ఉందని వీడియోలో కంటతడి పెట్టుకున్న దక్షిణ ఢిల్లీలోని మాల్వియా నగర్‌ కు చెందిన కాంతా ప్రసాద్ మరియు అతని భార్య బాదామి దేవి బాధను చూసి తట్టుకోలేకపోయిన సెలబ్రిటీలందరూ తమ అభిమానులు బాబా కా ఢాబా కు వెళ్లి తినండి అంటూ ట్వీట్‌లు చేశారు.

 Delhi Couple Filed A Case Against Food Blogger Delhi, Coronavirus, Baba Ka Daba-TeluguStop.com

దీనితో ప్రజల నుండి మంచి స్పందన లభించింది.ఆ వృద్ధ జంట సమస్య తీరింది.

తాజాగా ఈ జంట తమకు న్యాయం చేయాలని పోలీసులని ఆశ్రయించారు.ఇంతకీ విషయమేంటంటే తమ వీడియో చూసి తమకు సహాయం చేయడం కోసం విరాళాలు సేకరించిన ఫుడ్‌ బ్లాగర్‌ గౌరవ్‌ వాసన్.తమకు దాతలు ఇచ్చిన మొత్తంలో కేవలం 2.3 లక్షలు చెల్లించి మిగిలింది తానే ఉంచుకున్నాడని విరాళాల కోసం అతడు తన బ్యాంక్ అకౌంట్,అలాగే ఇతర కుటుంబ సభ్యుల బ్యాంక్ వివరాలను ఇచ్చాడని ఎలాగైనా తప్పుదోవ పట్టిన డబ్బును పోలీసులు పట్టుకోవాలనే ఉద్దేశంతోనే మేము ఫిర్యాదు చేశామని కాంతా ప్రసాద్ అన్నారు.ఇక ఈ విమర్శల పై స్పందించిన వాసన్ తన బ్యాంక్ స్టేట్ మెంట్స్ చూపిస్తూ ఓ వీడియో విడుదల చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube