మృత దేహం మంచి నీళ్లు తాగిందంటూ... అంత్యక్రియలను మధ్యలో ఆపేసి మరీ...!

సాధారణంగా ఎవరైనా చనిపోయిన తర్వాత అంత్యక్రియ కార్యక్రమాలు నిర్వహిస్తారు.ఇలా అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో ఓ మృతదేహం మంచి నీళ్లు తాగిందన్న భ్రమలో పడి బంధువులకు ఒక్కసారిగా హడలెత్తి పోయారు.

వారు బయపడడమే కాకుండా మిగితా వారిని భయపెట్టారు.సదరు వ్యక్తి బతికుండగానే తమ బంధువులు అంతక్రియలు నిర్వహిస్తున్నారేమో అన్న భయంతో వెంటనే మృతి చెందిన వ్యక్తికి అంత్యక్రియలు ఆపేసి మధ్యలోనే స్థానిక కేఐఎమ్ఎస్ ఆస్పత్రికి తరలించారు.

ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.ఈ సంఘటన కర్ణాటకలోని ధార్వాడ్ లో చోటు చేసుకుంది.

మృత దేహం మంచినీళ్లు తాగిందని భ్రమపడ్డ వారు అంత్యక్రియలు ఆపేసి మధ్యలోనే స్థానిక తీసుక వెళితే అక్కడి ఆసుపత్రి డాక్టర్లు మాత్రం అటువంటిది ఏమీలేదు అని స్పష్టంగా తెలిపారు.సదరు వ్యక్తి మృతి చెంది చాలా సమయం అయ్యిందని, అది కేవలం వారి అపోహ మాత్రమే అని బంధువులకు డాక్టర్లు తెలిపారు.

Advertisement

ఇక దీనితో వెంటనే ఆ మృతదేహానికి పూర్తిగా అంత్యక్రియలు నిర్వహించారు.అసలు నిజానికి సదరు వ్యక్తి గుండెపోటు కారణంగా మరణించినట్లు సమాచారం.

అయితే మృతదేహానికి స్నానాదికలు చేపించే సమయంలో నోటిలో పోసిన మంచినీరు మృత దేహం మింగేసినట్టు అంత్యక్రియలకు వచ్చిన వారిలో ఒకరు భ్రమ పడడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో పెద్ద మొత్తంగా కలకలం సృష్టించారు.

Advertisement

తాజా వార్తలు