ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, జిల్లా కలెక్టర్ సహా ఆరుగురికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.ఇటీవల ఓ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే, అధికారులు భూమి పూజ చేశారు.
అయితే ఆ భూమి తనదంటూ ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించింది.ఈ నేపథ్యంలో బాధితురాలి పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఎమ్మెల్యే, కలెక్టర్ సహా ఆరుగురికి నోటీసులు జారీ చేసింది.