జీవనోపాధి కోసం నగరానికి వలసొచ్చిన భార్యాభర్తలు విగతజీవులుగా కనిపించారు.భర్త భవంనపై నుంచి దూకేసి ఆత్మహత్య చేసుకున్నాడు.
భార్య ఇంట్లో శవమై తేలింది.ఈ విషాద ఘటన హైదరాబాద్లోని పంజాగుట్టలో చోటుచేసుకుంది.
పూర్తీ వివరాల్లోకి వెళ్తే.శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాగేశ్వరరావు, రోజా భార్యాభర్తలు.
పదేళ్ల కిందట బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు.వారు పంజాగుట్ట పరిధిలో ఓ అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నారు.
ఆ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.దంపతులు ఒక్కసారిగా మృతి చెందడంతో స్థానికులు ఆందోళనకు గురైయ్యారు.
దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు సంఘటన స్థలాన్ని చేరుకొని పరిశీలించారు.కేసు నమోదు చేసుకొని పలు కోణాలలో దర్యాప్తు చేపట్టారు.
మృతుడు నాగేశ్వరరావు తాను అద్దెకు ఉంటున్న నివాస భవనం పైనుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.మృతుడి భార్య రోజా అనుమానాస్పద స్థితిలో ఇంట్లో శవమై తేలింది.
భర్త నాగేశ్వరరావు భార్యను హత్య చేసి.తాను ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
మృతురాలు రోజా ఒంటిపై ఎలాంటి గాయాలైన ఆనవాళ్లు కనిపించకపోవడంతో ఆమె మరణం ఇప్పుడు మిస్టరీగా మారింది.నాగేశ్వరరావు తన భార్య ముఖంపై దిండుతో గట్టిగా అదిమి హత్య చేసి ఉండొచ్చని.
లేకుంటే ఆవేశంలో ఛాతిపై బలంగా కొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయి ఉంటుందని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.భార్యను హత్య చేసిన అనంతరం భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరం మిస్టరీ వీడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy