ఈ వైరస్ ఇప్పటిది కాదట,ఎప్పుడో పదేళ్ల క్రితమే...

కరోనా వైరస్

దేశవ్యాప్తంగా ఎంత మంది ప్రాణాలను బలితీసుకుంటుందో అందరికి తెలిసిందే.అయితే ప్రపంచ దేశాల్లో చాలా వేగంగా వ్యాపించడం పై కొంతమంది శాస్త్రవేత్తల బృందానికి కొత్త డౌట్ ఒక వచ్చింది.

ఈ వైరస్ అందరూ అనుకుంటున్నట్లుగా కొత్తగా వ్యాపించింది కాదని,ఇదో దాదాపు పదేళ్ల కిందటే వ్యాపించి ఉంటుంది అని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.2019 నవంబర్ లేదా డిసెంబర్‌లో మనుషులకు ఈ వైరస్ వ్యాపించలేదనీ.దాదాపు పదేళ్ల కిందటే అది వ్యాపించి ఉంటుందని తమ అధ్యయన వివరాల్ని జర్నల్ నేచర్ మెడిసిన్‌లో శాస్త్రవేత్తల బృందం రాసిపెట్టింది.

అయితే తొలుత ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకు వ్యాపించి ఉంటుందని అంచనా వేసింది.ఈ అధ్యయనంలో ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా సైంటిస్టులు ఉన్నారు.మార్చి 17న తమ పరిశోధన వివరాల్ని వెల్లడించగా దానిలో ఈ వివరాలను వెల్లడించినట్లు తెలుస్తుంది.

అయితే పదేళ్ల క్రితం వచ్చిన ఈ వైరస్ వల్ల అప్పుడే ఎందుకు ఎవరూ చనిపోలేదు,ఇప్పుడు ఎందుకు చనిపోతున్నారు అన్న నుమానం రాకమానదు.అయితే దానికి కూడా శాస్త్రవేత్తలు ఒక సమాధానం ఇచ్చారు.

కొన్నేళ్ల కిందటే మనషుల్లోకి ఎంటరైన ఈ వైరస్.క్రమక్రమంగా తనలో

జన్యుపరమైన మార్పులు

(Evolution and Mutation) చేసుకుంటూ ఉండి ఉండొచ్చని అంటున్నారు.

Advertisement

మొదట్లో బలహీనంగా ఉన్న ఈ వైరస్.సంవత్సరాల తరబడి బలం పెంచుకుంటూ.

మనుషుల నుంచి మనుషులకు వ్యాపించేంత బలం ఇప్పుడు సంపాదించుకొని ఉండొచ్చని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటివరకూ కరోనా వైరస్ జన్యువుల్ని గమనిస్తే.

అది సహజ సిద్ధంగానే వచ్చింది తప్ప ఏ అంతరిక్షం నుంచో జారి పడలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఓ శాస్త్రవేత్త మరో ఆసక్తికర అభిప్రాయం వ్యక్తం చేశారు.అందరూ అనుకుంటున్నట్లు ఈ వైరస్.మొదట చైనాలోని వుహాన్‌లో రాలేదనీ అంతకంటే ముందే ఇటలీలో అత్యధిక కేసులు నమోదైన లాంబార్డీలో వచ్చి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

ఇప్పటికే ఈ కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 37 వేల మంది మృతి చెందగా,7 లక్షలకు పైగా ఈ కరోనా భారిన పడడం తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు