సెకండ్‌ వేవ్‌ లో మరో కథను సిద్దం చేసిన కొరటాల శివ

కరోనా సెకండ్‌ వేవ్‌ వల్ల షూటింగ్‌ లు నిలిచి పోయాయి.గడచిన నెల రోజులుగా షూటింగ్ లకు బ్రేక్ పడింది.

మరి కొన్ని రోజుల పాటు షూటింగ్ కు అవకాశం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది.ఈ సమయంలో హీరోలు ఖాళీగా ఉండకుండా కొత్త కథలు వినడం చదవడం చేస్తున్నారు.

దర్శకులు మరియు రచయితలు మాత్రం కొత్త కథలు తయారు చేసే పనిలో పడుతున్నారు.కొరటాల శివ ఇప్పటికే ఎన్టీఆర్‌ తో సినిమా కన్ఫర్మ్‌ చేసుకున్నాడు.

తదుపరి సినిమా అల్లు అర్జున్‌ తో సినిమా అంటున్నారు.అతి త్వరలోనే మళ్లీ స్టార్‌ హీరోతో సినిమాను చేసేందుకు ఆయన కథను సిద్దం చేసినట్లుగా సమాచారం అందుతోంది.

Advertisement

కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం రూపొందుతున్న ఆచార్య సినిమా నిలిచి పోయింది.ఆ సినిమా షూటింగ్‌ బ్యాలన్స్ పూర్తి చేసి కాని ఎన్టీఆర్‌ సినిమాను మొదలు పెట్టే అవకాశం లేదు.

కనుక ఈ గ్యాప్ ను కొత్త కథలపై కుస్తి పడుతున్నట్లుగా తెలుస్తోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవల ఒక యంగ్ స్టార్‌ హీరో కోసం కొరటాల శివ కథను సిద్దం చేశాడట.

ఆ హీరో మరెవ్వరో కాదు అఖిల్‌ అక్కినేని. ఇటీవలే నాగార్జునకు ఆ కథ ను వినిపించడంతో పాటు ఓకే కూడా చెప్పించుకున్నాడట.

వచ్చే ఏడాది లో ద్వితీయార్థంలో వీరి కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.ప్రస్తుతం సినిమా కు సంబంధించిన స్క్రిప్ట్‌ పై మరింతగా చర్చలు జరుపుతున్నారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

అఖిల్‌ కోసం ఒక సక్సెస్ కావాలనే ఉద్దేశ్యంతో నాగ్‌ కాస్త ఎక్కువగా ప్రయత్నించి కొరటాల ను రంగంలోకి దించబోతున్నాడు.అఖిల్‌ నటించిన మోస్ట్‌ ఎలిజబుల్ బ్యాచిలర్‌ విడుదలకు సిద్దంగా ఉంది.

Advertisement

ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా ను కూడా అఖిల్‌ మొదలు పెట్టాడు.అతి త్వరలోనే కొరటాల దర్శకత్వంలో సినిమా ను అఖిల్‌ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

తాజా వార్తలు