ప్రజాపాలన అంతం కావాలని కుట్రలు..: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( Telangana CM Revanth Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలోనే బీఆర్ఎస్, బీజేపీపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

 Conspiracies To End Democracy..: Cm Revanth Reddy, Kcr, Brs , Democracy, Bjp,-TeluguStop.com

కారు పాడైపోయి షెడ్ కు పోయిందన్న రేవంత్ రెడ్డి ఇకపై దాన్ని తుక్కుకు వేయాల్సిందేనని విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని కేసీఆర్( KCR ) అంటున్నారని, 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని అంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే దమ్ముంటే కాంగ్రెస్ ను టచ్ చేసి చూడాలన్నారు.కాంగ్రెస్ హైటెన్షన్ వైరు లాంటిదని, ముట్టుకుంటే మాడి మసై పోతారని రేవంత్ రెడ్డి తెలిపారు.

కాంగ్రెస్ ఎలా ఖాళీ అవుతుందో తాను చూస్తానని చెప్పారు.మీలాంటోళ్లను తొక్కుకుంటూ ఈ స్థాయికి వచ్చానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.కేసీఆర్, మోదీ చీకట్లో ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు.కేసీఆర్, మోదీ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతారా అని ప్రశ్నించారు.ప్రజాపాలన అంతం కావాలని కుట్రలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలోనే పదేళ్లు ఇందిరమ్మ రాజ్యం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube