మహాత్మా జ్యోతి రావు పులే గొప్ప సంఘ సంస్కర్త …నాయిని
మహాత్మా జ్యోతి రావు పులే జయంతి సందర్భంగా బుధవారం హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతి రావు పులే చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా అయన సేవలను కొనియాడారు.
అనంతరం నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతి రావు ఫూలే.మహాత్మా జ్యోతి రావు ఫూలే ఆశయాలను సమాజమలోని ప్రతి ఒక్కరు కొనసాగించాలని అన్నారు.
మహాత్మా జ్యోతి రావు ఫూలే సామాజిక ఉద్యమకారుడని, గొప్ప సంఘ సంస్కర్త అని, వెనుకబడిన, అట్టడుగు వర్గాల ప్రజల్లో వెలుగు నింపిన సామాజిక తత్వవేత్త అని అన్నారు.విద్యతోనే సామజిక అభివృద్ధి సాధ్యమని, అయన చూపిన బాటలోనే అందరు నడవాలని, కుల మతాల వ్యతిరేకంగా సమానత్వం కోసం పోరాడిన మాత్ముని కృషి మరువలేనిదని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పోరటర్ తోట వెంకటేశ్వర్లు, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు బంక సంపత్ యాదవ్, గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యదర్శులు బొంత సారంగం, ఎర్ర మహేందర్, డివిజన్ అద్యక్షులు ఎస్.కుమార్ యాదవ్, మహమ్మద్ జాఫర్, గాండ్ల స్రవంతి, వల్లపు రమేష్, మహమ్మద్ అఫ్సర్, తక్కలపల్లి మనోహర్, యూత్ కాంగ్రెస్ నాయకులు సాయిరామ్ యాదవ్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.