కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ తెలంగాణను నిరుత్సాహపరిచిందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.ఈ బడ్జెట్ పేదలకు వ్యతిరేకమన్న ఆయన కార్పొరేట్ కు అనుకూలమంటూ విమర్శలు గుప్పించారు.
పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల గురించి కూడా ప్రస్తావన లేదని ఎంపీ ఉత్తమ్ కుమార్ మండిపడ్డారు.పునర్విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు తేవడంలో కేసీఆర్ విఫలం అయ్యారని విమర్శించారు.