బీహార్ మంత్రివర్గ విస్తరణ ఈనెల 16 న జరుగనున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ సారథ్యంలోని మహా గడ్బంధన్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి మూడు మంత్రి పదవులు దక్కనున్నాయి.ముందుగా ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారని ఏఐసీసీ రాష్ట్ర ఇంఛార్జ్ భక్త చరణ్ దాస్ ప్రకటించారు.16వ తేదీ తర్వాత మరోసారి జరిగే విస్తరణలో మూడో ఎమ్మెల్యే మంత్రివర్గంలో చేరుతారని వెల్లడించారు.అదేవిధంగా ప్రభుత్వంలో చేరే ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు ఇంకా ఖరారు చేయాల్సి ఉందని తెలిపారు.
తాజా వార్తలు