ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా జరుగుతున్నాయి.చాలా వరకు పరిస్థితిని అదుపులోకి తీసుకుని పోలీసులు మరియు ప్రభుత్వ అధికారులు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
ఇలాంటి తరుణంలో చిత్తూరు జిల్లా రామచంద్రపురం మండలం లో కమ్మ కండ్రిగ లో మాత్రం తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఆందోళనలకు దిగటం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
మేటర్ లోకి వెళ్తే ఓటర్ స్లిప్ లపై ఎన్నికల గుర్తు రాసి పంపుతున్నారని, ఇది పూర్తిగా ఎన్నికల నియమావళికి విరుద్ధమని, పోలీసులకు, ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని చిత్తూరుకు చెందిన టిడిపి పార్టీ క్యాడర్ మరియు నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో అధికారులు చొరవ తీసుకోకపోతే వెంటనే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని టిడిపి పార్టీకి చెందిన నాయకులు ఆందోళన చేస్తున్నారు.ఎన్నికలు సామరస్య వాతావరణంలో సజావుగా జరిగేలా ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగాలని అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.