సర్జరీ తర్వాత మొదటిసారి స్టేజ్ పై సందడి చేసిన జబర్దస్త్ కమెడియన్?

బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి కామెడీ షోలలో జబర్దస్త్ (Jabardasth)కార్యక్రమం ఒకటి.

ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్ ఇండస్ట్రీకి పరిచయం అవ్వడమే కాకుండా ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హీరోలుగాను దర్శకులుగాను కొనసాగుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో పంచ్ ప్రసాద్(Punch Prasad)ఒకరు.ఈయన అద్భుతమైన కామెడీ పంచ్ డైలాగులకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.

ఇలా కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రసాద్ మాత్రం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.

ఈయన రెండు కిడ్నీలు పాడవగా కొంతమంది జబర్దస్త్ కమెడియన్స్ సహాయంతో ఇదివరకు చికిత్స తీసుకున్నారు.అయితే ఈయన ఆరోగ్యం పూర్తిగా పాడవడంతో వెంటనే సర్జరీ చేయాలని వైద్యులు తెలిపారు.ఇలా సర్జరీ కోసం భారీ మొత్తంలో ఖర్చు అవుతుందని తెలిసి దాతల సహాయం కోసం ఎదురుచూశారు.

Advertisement

ఈ క్రమంలోనే తనకు సహాయం చేయాలని తన స్నేహితుల సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నటువంటి ఒకప్పటి జబర్దస్త్ జడ్జ్, ప్రస్తుత ఏపీ మంత్రి రోజా(Roja )జగన్మోహన్ రెడ్డికి తన పరిస్థితిని వివరించి సర్జరీకి కావలసిన ఏర్పాట్లను చేయించారు.

ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వ చొరవతో ఈయనకు సర్జరీ పూర్తి అయింది.ఇలా సర్జరీ సక్సెస్ అయిన తర్వాత కొద్ది రోజులపాటు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ ఉన్నటువంటి పంచ్ ప్రసాద్ తాజాగా జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేశారు.ఇలా చాలా రోజుల తర్వాత తిరిగి ఈ కార్యక్రమంలోకి వచ్చినటువంటి ఈయన ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.

ప్రసాద్ తన తండ్రి గురించి మాట్లాడుతూ నాకు నాన్న ఉన్నప్పుడు తన విలువ తెలియలేదు కానీ ఇప్పుడు నాన్న అయిన తరువాత నాకు నాన్న విలువ ఏంటో తెలుస్తుంది.నాకు నా కొడుకు ఉన్నప్పటికీ తానే నాకు తండ్రి అని నేను బాధపడుతూ ఉండగా నాకేమీ కాదు అంటూ నా కొడుకు ఎన్నోసార్లు నాకు ధైర్యం చెప్పారు అంటూ ప్రసాద్ ఈ సందర్భంగా ఎమోషనల్ అవుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

బీట్‌రూట్ ఆకుల‌తో ఇలా చేస్తే.. ఊడిన జుట్టు మ‌ళ్లీ వ‌స్తుంది!
Advertisement

తాజా వార్తలు