గుంటూరులో ఓటు నమోదు చేసుకున్న కమెడియన్ అలీ!

టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ త్వరలో రాజకీయాలలోకి వచ్చి ఎమ్మెల్యేలో పోటీ చేయాలనే ఆలోచనలో వున్న సంగతి అందరికి తెలిసిందే.

ఇప్పటికే వైసీపీ, జనసేన పార్టీలో చర్చలు జరిపిన అలీ అక్కడ టికెట్ కన్ఫర్మ్ లేకపోవడంతో ఇక తాను మొదటి నుంచి వున్న టీడీపీ అధినేత చంద్రబాబుతో చర్చించిన సంగతి తెలిసిందే.

ఆ మధ్య మీడియాలో కూడా తాను ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో పాటు మంత్రిగా కూడా చేయాలనుకుంటున్న అని తనకి ఆ అవకాశం ఎవరు ఇస్తారో ఆ పార్టీ తరుపున పోటీ చేస్తా అని చెప్పుకొచ్చాడు.ఈ నేపధ్యంలో అతనికి టీడీపీ పార్టీ నుంచి హామీ లభించినట్లు తెలుస్తుంది.

ఇదిలా వుంటే తాజాగా అలీ గుంటూరులో తన ఓటు నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నారు రానున్న ఎన్నికలలో గుంటూరు తూర్పు నుంచి టీడీపీ తరుపున అలీ ఎమ్మెల్యేగా బరిలో నిలబడే అవకాశం వుందని ప్రచారం వున్న నేపధ్యంలో ఓటు నమోదు చేసుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇప్పటి వరకు హైదరాబాద్ లో వున్న తన ఓటుని తొలగించి గుంటూరు తూర్పు నియోజకవర్గంలోనే ఓటు హక్కు నమోదు చేసుకున్నాడని తెలుస్తుంది.

గన్నవరంలో వర్షంలో చంద్రబాబు ప్రసంగం..!!
Advertisement

తాజా వార్తలు