సూర్యాపేట జిల్లా: కేంద్రంలోని కుడకుడ ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు( Collector S.
Venkatarao )తెలిపారు.బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్ నిర్మాణ పనులను ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్ పనులు వేగవంతంగా జరగాలని,త్వరలో పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు.పనులలో మెటీరియల్, లేబర్ ను పెంచి పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఈఈ ఎం.యాకూబ్, డిఈ పవన్ కుమార్,ఏఈ యుగేందర్ పాల్గొన్నారు.