తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తుంది.ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy) ప్రచార పర్వంలో దూకుడు పెంచారు.
లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థులకు మద్ధతుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.రోజుకు రెండు, మూడు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇవాళ కూడా మరో మూడు సభలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.సికింద్రాబాద్, వరంగల్ మరియు చేవెళ్ల అభ్యర్థుల నామినేషన్ ర్యాలీలో పాల్గొన్ని ప్రచారాన్ని నిర్వహించారు.
మొదటగా సికింద్రాబాద్( Secunderabad )కు వెళ్లనున్న ఆయన ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్( Danam Nagende ) నామినేషన్ ర్యాలీలో పాల్గొననున్నారు.తరువాత వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిని కడియం కావ్యకు మద్ధతుగా రేవంత్ ప్రచారం చేపట్టనున్నారు.
సాయంత్రం చేవెళ్ల నియోజకవర్గానికి వెళ్లనున్న రేవంత్ రెడ్డి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి( Ranjith Reddy )కి మద్ధతుగా ఎన్నికల ప్రచారం చేయనున్నారు.సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులతో పాటు పార్టీ శ్రేణులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.