తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పయనం కానున్నారు.ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం హస్తినకు వెళ్లనున్న ఆయన తిరిగి రాత్రికి హైదరాబాద్ కు రానున్నారు.
మంత్రులకు శాఖల కేటాయింపులపై పార్టీ అధిష్టానంతో రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్ పిలుపు మేరకు ఆయన ఢిల్లీకి వెళ్తున్నారని సమాచారం.
కాగా నిన్న ఆయనతో పాటు పదకొండు మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.