జాతీయ రైతు సంఘాల నేతలతో తెలంగాణ సీఎం కేసీఆర్ వరుసగా రెండో రోజు సమావేశమయ్యారు.దేశంలో వ్యవసాయం ఎదుర్కొంటున్న పరిస్థితులతో పాటు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
అదేవిధంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై రైతు సంఘాలకు కేసీఆర్ వివరించనున్నారు.ఈ సందర్భంగా దేశాన్ని సంక్షోభం నుంచి బయటపడేసేందుకు, ప్రజా సంక్షేమం కోరుకునే శక్తులు సంఘర్షణ సాగించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
ఈ క్రమంలో వచ్చిన అడ్డంకులన్నింటినీ దాటుకుని ఐక్యతతో నిర్ణీత లక్ష్యాన్ని చేరుకోవాలని తెలిపారు.







