ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.స్కిల్ పేరుతో గత ప్రభుత్వం అడ్డంగా దోచుకుందని ఆరోపించారు.
డబ్బులు దోచేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని విమర్శించారు.
విద్యార్థుల పేరుతో జరిగిన అతిపెద్ద స్కాం అని సీఎం జగన్ తెలిపారు.ఈ కుంభకోణాన్ని చంద్రబాబు నడిపారని ఆధారాలు ఉన్నాయన్న జగన్ రూ.371 కోట్లు మాయం అయ్యాయని పేర్కొన్నారు.ఇదంతా స్కిల్డ్ క్రిమినల్ చేసిన అతిపెద్ద స్కాం అని వెల్లడించారు.