ఏపీ సీఎం జగన్ కుప్పం పర్యటన వాయిదా పడింది.ఈనెల 22న పర్యటనకు వెళ్లాల్సి ఉండగా.
అనివార్య కారణాల వలన 23కు వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు.దీనిలో భాగంగా ముందుగా ఉదయం 11.25 గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరుకానున్నారు.అనంతరం వైఎస్ఆర్ చేయూత పథకం కింద లబ్దిదారుల ఖాతాల్లో రూ.18,750 చొప్పున జమ చేయనున్నారు.







