వైసీపీ ఆరోపించినట్లు టీడీపీ నేతలే డేటా చౌర్యం చేశారనే దానికి ఆధారాలు ఉన్నాయా అని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు.టీడీపీ ఎమ్మెల్యేలు లేకుండా హౌస్ కమిటీ ఏంటని నిలదీశారు.
డేటా తీసుకుని ఓట్లను తొలగించినట్లు ఆరోపిస్తున్నారు.కానీ, ఏం డేటా పోయిందో చెప్పే ధైర్యం ప్రభుత్వానికి లేదని విమర్శించారు.
పెగాసస్ వాడారన్న ఒక్క పదాన్ని నివేదికలో చెప్పలేకపోయారని పయ్యావుల ఎద్దేవా చేశారు.పెగాసస్ వాడలేదని మేం కచ్చితంగా చెప్పగలమన్న ఆయన.మీ పార్టీ నేతలకు డేటా ఇచ్చింది నిజమా.? కాదా.? అని ప్రశ్నించారు.వైసీపీ ప్రభుత్వం డేటా చోరీ చేసి టీడీపీపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.