సీఎం జగన్ కడప జిల్లా పర్యటన డీటెయిల్స్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు ఎల్లుండి కడప జిల్లాలో పర్యటనకు రెడీ అవుతున్నరు.

రేపు ఉదయం తాడేపల్లి నివాసం నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.

అనంతరం అక్కడ నుండి కడప విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకొని.రోడ్డు మార్గం గుండా పులివెందులకు బయలుదేరుతారు.

అక్కడ 11 గంటలకు పులివెందుల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో.పులివెందుల మున్సిపాలిటీ ప్రతినిధులతో సమావేశం అవుతారు.మధ్యాహ్నం ఒంటిగంట నుండి మూడు గంటల వరకు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారు.

అనంతరం వేంపల్లి లో బాలురు బాలికల ఉన్నత పాఠశాల ప్రారంభించనున్నారు.సాయంత్రం ఐదున్నర గంటలకు ఇడుపులపాయకి చేరుకుంటారు.

Advertisement

మరుసటి రోజు ఉదయం 8 గంటలకు జులై 8 వ తారీకు వైయస్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలు వైయస్ సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు.అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు తిరిగి విజయవాడకు సీఎం జగన్ చేరుకోనున్నారు.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు