ఒకే ఫ్లెక్సీలో సీఎం జగన్, పవన్ కళ్యాణ్.. వైరల్ అవుతున్న భీమ్లా నాయక్ ఫ్లెక్సీ?

ప్రపంచ వ్యాప్తంగా మూడు వేలకు పైగా థియేటర్లలో నేడు భీమ్లా నాయక్ మూవీ రిలీజైంది.10,000కు పైగా భీమ్లా నాయక్ షోలు ప్రపంచ వ్యాప్తంగా నేడు ప్రదర్శించ బడుతున్నాయని సమాచారం అందుతోంది.

పవన్ అభిమానులు తొలిరోజే భీమ్లా నాయక్ సినిమాను థియేటర్లలో చూడాలని భావిస్తున్నారు.

కలెక్షన్ల విషయంలో భీమ్లా ఖాతాలో రికార్డులు గ్యారంటీ అని ప్రేక్షకుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సీఎం జగన్, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రత్యర్థులు అనే సంగతి తెలిసిందే.

అయితే భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ సందర్భంగా ఒక అభిమాని ఒకే ఫ్లెక్సీలో పవన్ జగన్ ఫోటోలను పక్కపక్కన పెట్టి బ్యానర్ వేయించారు.ఒకే ఫ్రేమ్ లో పవన్ జగన్ ను చూసి అభిమానులు షాకవుతున్నారు.

ఒకవైపు జగన్ సర్కార్ ఏపీలో భీమ్లా నాయక్ సినిమా విషయంలో కఠినంగా నిబంధనలు అమలు చేస్తుంటే మరోవైపు ఫ్యాన్స్ మాత్రం జగన్, పవన్ ఫోటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తుండటం గమనార్హం.

Advertisement

కొంతమంది అభిమానులు మాత్రం ఈ ఫ్లెక్సీని చించేయాలని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.ఈ ఫ్లెక్సీని ఎక్కడ ఏర్పాటు చేశారనే వివరాలు తెలియాల్సి ఉంది.పవన్, జగన్ లకు కామన్ అభిమానులే ఈ తరహా పనులు చేస్తున్నారని సమాచారం అందుతోంది.

మ్యూచువల్ ఫ్యాన్స్ అటు జగన్ ను సపోర్ట్ చేయాలో లేక పవన్ ను సపోర్ట్ చేయాలో అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారు.భీమ్లా నాయక్ సినిమాకు ఫస్ట్ టాక్ పాజిటివ్ గా ఉండగా ఈరోజు సాయంత్రానికి ఈ సినిమా తుది ఫలితం తెలిసే ఛాన్స్ ఉంది.

పవన్ అభిమానులకు మాత్రం ఈ సినిమా బాగా నచ్చేసింది.అయ్యప్పనుమ్ కోషియమ్ ను దృష్టిలో ఉంచుకోకుండా థియేటర్ కు వెళితే మాత్రం ఫ్యాన్స్ కు ఈ సినిమా ఫుల్ మీల్స్ లా ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement
" autoplay>

తాజా వార్తలు