CLP Meeting: సాయంత్రం ప్రజాభవన్ లో సీఎల్పీ సమావేశం..!

హైదరాబాద్ లోని ప్రజాభవన్ (Prajabhavan) లో ఇవాళ సాయంత్రం సీఎల్పీ సమావేశం (CLP Meeting) కానుంది.

ఈ మేరకు సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన ఈ భేటీని నిర్వహించనున్నారు.

కాగా రేపు అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖ ( Irrigation Department) పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది.శ్వేతపత్రం విడుదల చేసిన అనంతరం ఇరిగేషన్ శాఖపై అసెంబ్లీ(Assembly)లో చర్చ జరగనుంది.

దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు.ప్రాజెక్టులను కేఆర్ఎంబీ (KRMB)కి అప్పగించే విషయంలో చెలరేగిన వివాదంపై నేతలు ప్రధానంగా చర్చించనున్నారు.

అలాగే ఎల్లుండి మేడిగడ్డను ఎమ్మెల్యేలు(MLAs) సందర్శించనున్నారు.కాగా ఎమ్మెల్యేల మేడిగడ్డ సందర్శనపై కూడా ఇవాళ్టి సీఎల్పీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

Advertisement
ఆ విషయంలో ప్రభాస్, నాని గ్రేట్ అంటున్న అభిమానులు.. అసలేమైందంటే?

తాజా వార్తలు