టీడీపీ అధినేత చంద్రబాబు,( Chandrababu ) జనసేనాని పవన్ కల్యాణ్( Pawan Kalyan ) భేటీ ముగిసింది.దాదాపు మూడు గంటల పాటు వీరిద్దరి సమావేశం కొనసాగింది.
టీడీపీ, జనసేన( TDP Janasena ) పోటీ చేసే స్థానాలపై రెండు పార్టీల అధినేతలు స్పష్టతకు వచ్చారని తెలుస్తోంది.అలాగే పొత్తుల నేపథ్యంలో జనసేన పోటీ చేసే స్థానాల్లో టీడీపీ ఆశావహులకు నచ్చజెప్పి వారి రాజకీయ భవిష్యత్ కు టీడీపీ అధిష్టానం హామీ ఇవ్వనుందని సమాచారం.

టీడీపీ మరియు జనసేన పోటీ చేసే స్థానాల్లో ఆశావహులకు నచ్చజెప్పిన తరువాత మంచి రోజు చూసుకొని స్థానాలకు అభ్యర్థులను చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రకటించనున్నారని తెలుస్తోంది.త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో టీడీపీ – జనసేన పార్టీలు పోటీ చేసే స్థానాలతో పాటు అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేసిన సంగతి తెలిసిందే.







