టాలీవుడ్ హీరో బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో విజయవంతంగా దూసుకుపోతోంది.అంతే కాకుండా అత్యధిక వ్యూస్ ని రాబడుతూ రికార్డులను బద్దలు కొడుతోందీ.
ఇప్పటికే అన్ స్టాపబుల్ సీజన్ వన్ ముగిసిన విషయం తెలిసిందే.ప్రస్తుతం ఆహా లో సీజన్ 2 స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ నేపథ్యంలోనే సీజన్ 2 కి సంబంధించిన మొదటి ఎపిసోడ్ కూడా పూర్తి అయింది.ఇక మొదటి ఎపిసోడ్ కు బాలయ్య బాబు వియ్యంకుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ హాజరయ్యారు.
అయితే బాలకృష్ణ షోలో వివాదాస్పద ప్రశ్నలను కూడా సరదాగా సంధిస్తూ సెలబ్రిటీలతో అంతే సరదాగా సమాధానాలను రాబట్టడం అందరికీ తెగ నచ్చేసింది.ఇక ఇది ఇలా ఉంటే బాలకృష్ణతో పాటు కలిసినటించిన అగ్ర హీరోలు చిరంజీవి, నాగార్జున,వెంకటేష్ లు మొదటి సీజన్లో పాల్గొన లేకపోయారు.
దీంతో బాలకృష్ణ అభిమానులతో పాటు ఆయా స్టార్ హీరోల అభిమానుల మనసులలో ఒక అనుమానం ఏర్పడింది.తమ అభిమాన హీరోలను బాలకృష్ణ షో కీ పిలవరా సందేహం ఏర్పడింది.
ఇకపోతే అన్ స్టాపబుల్ సీజన్ వన్ లో మొదటి ఎపిసోడ్ చిరంజీవితో మొదలవుతుంది అంటూ వార్తలు వినిపించాయి.
ఊహించని విధంగా మొదటి ఎపిసోడ్ మోహన్ బాబుతో మొదలయ్యింది.ఆ తర్వాత మళ్లీ చిరంజీవి షోకీ హాజరవుతున్నారు అంటూ పలుసార్లు వార్తలు వినిపించినప్పటికీ చిరంజీవి మాత్రం హాజరు కాలేకపోయారు.ఇక చివరి ఇంటర్వ్యూ అయినా చిరంజీవి వస్తారని అభిమానులు ఆశపడ్డారు.
అది కూడా జరగలేదు.అయితే గతంలో చిరంజీవి ఈ షోకి హాజరవుతాను అని మాట ఇచ్చినందువల్ల సీజన్ 2 లో తప్పకుండా చిరంజీవితో ఇంటర్వ్యూ ఉంటుంది అని అంటున్నారు.
మరి చిరంజీవితో ఇంటర్వ్యూ మధ్యలో ఉంటుందా లేకపోతే చివరి ఎపిసోడ్ ఉంటుందా అన్నది తెలియాలి మరి.అలాగే నాగార్జునను కూడా ఈ షో కి నిర్వాహకులు ఆహ్వానించారట.కానీ నాగార్జునకు బాలకృష్ణకు మధ్య వ్యక్తిగత అభిప్రాయ భేదాలు కారణంగా నాగార్జున ఈ షో ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించాడు అని వార్తలు వినిపిస్తున్నాయి.