సామ్‌ జామ్‌ : చిరు ఎపిసోడ్‌ హోల్ట్‌ లో పెట్టడానికి కారణం అదేనా?

సమంత హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సామ్‌ జామ్‌ మొదటి ఎపిసోడ్‌లో విజయ్‌ దేవరకొండ పాల్గొనగా రెండవ ఎపిసోడ్‌ లో రానా నాగ్‌ అశ్విన్ ‌లు పాల్గొన్నారు.

రానా ఎపిసోడ్‌ కంటే ముందే చిరంజీవి ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశం ఉందని అంతా భావించారు.

షూటింగ్‌ కూడా పూర్తి చేసుకున్న చిరంజీవి ఎపిసోడ్‌ ను ఎందుకు స్ట్రీమింగ్‌ చేయడం లేదు అర్థం కావడం లేదు.మూడవ వారంలో అయినా చిరంజీవి ఎపిసోడ్‌ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారేమో అని అంతా ఎదురు చూశారు.

కాని అనూహ్యంగా ఈ వారం కూడా చిరు కాకుండా మరొకరిని తీసుకు వచ్చారు.ఈ వారం సైనా నెహ్వాల్‌ మరియు ఆమె భర్తను సమంత ఇంటర్వ్యూ చేసింది.

నందిని రెడ్డి ఈ కార్యక్రమం జరుగుతున్న విషయం తెల్సిందే.

Advertisement

చిరంజీవితో ఇప్పటికే షూటింగ్‌ పూర్తి అయినా కూడా సామ్‌ జామ్‌ ఆ ఎపిసోడ్‌ ను ఆహా వారు ఎందుకు ఆపుతున్నారు అనే వార్తల వెనుక ఆశ్చర్యకర వార్తలు వస్తున్నాయి.సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ షోను రాబోయే వారాళ్లో స్ట్రీమింగ్‌ చేయబోతున్నారట.ఎందుకంటే షో హైప్‌ పెరగడంతో పాటు మరింత మందికి ఆహా రీచ్‌ అయిన తర్వాత ఒక ప్రత్యేక సందర్బంలో చిరంజీవి ఎపిసోడ్‌ ను స్ట్రీమింగ్‌ చేయడం వల్ల మంచి వ్యూవర్‌ షిప్‌ వస్తుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.

సంక్రాంతి కానుకగా ఈ ఎపిసోడ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారంటూ ఆహా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ప్రస్తుతం ఆహా లో ఆసక్తికర కంటెంట్‌ వరుసగా వస్తుంది.

అయినా కూడా చాలా మంది చిరంజీవి ఎపిసోడ్‌ కోసం ఎదురు చూస్తున్నారు.ఎప్పుడెప్పుడు ఆ ఎపిసోడ్‌ వస్తుందా అంటూ మీడియా కూడా ఎదురు చూస్తుంది.

సమంత ఒక పెద్ద స్టార్‌ ను మెగాస్టార్‌ ను ఇంటర్వ్యూ చేసిందంటే ఆమె అభిమానులకు కూడా చాలా ఆనందం.అందుకే ఆమె ఈ షో తో అందరిని సంతృప్తి పర్చిందా అనేది చూడాలి.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు