సినిమాలకు గుడ్‌ బై చెప్పేస్తున్నాను అంది

నీ తోడు కావాలి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా 2002 సంవత్సరంలో పరిచయం అయిన ముద్దుగుమ్మ ఛార్మి ఆ తర్వాత రెండేళ్లకు కృష్ణవంశీ దర్శకత్వంలో చేసిన శ్రీఆంజనేయం చిత్రంతో మంచి ఫేమ్‌ను దక్కించుకుంది.

ఆ సినిమా ఫ్లాప్‌ అయినా కూడా అప్పటి నుండి వెనుదిరిగి చూడకుండా వరుసగా సినిమాలు చేస్తూ దశాబ్ద కాలం పాటు స్టార్‌ హీరోయిన్‌గా వరుసగా సినిమాలు చేసింది.

ఐటెం సాంగ్స్‌తో ప్రత్యేక పాత్రలతో ఛార్మి అలరిస్తూ వచ్చింది.దాదాపుగా పుష్కర కాలం పాటు హీరోయిన్‌గా కొనసాగిన ఛార్మి సినిమాలకు గుడ్‌ బై చెబుతున్నట్లుగా ప్రకటించింది.

ఇకపై తాను హీరోయిన్‌గా నటించబోవడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది.నిర్మాణంపై ఆసక్తితో తాను నిర్మాతగా కొనసాగనున్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది.

ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో సహాయ నిర్మాతగా మారిన ఛార్మి తదుపరి చిత్రంగా విజయ్‌తో పూరి తెరకెక్కిస్తున్న సినిమాకు ఒక నిర్మాతగా వ్యవహరిస్తుంది.ఇకపై నిర్మాతగా మాత్రమే కొనసాగుతానంటూ ప్రకటించింది.

Advertisement

నేను నటించిన జ్యోతి లక్ష్మి సినిమా సమయంలోనే ఈ విషయాన్ని ప్రకటించాలనుకున్నాను.కాని ఆ సమయంలో పూరి, కళ్యాణ్‌ సలహాతో నా ప్రకటన వాయిదా వేసుకున్నాను.

నటిగా రిటైర్మెంట్‌ తీసుకుంటున్న తాను నిర్మాతగా బిజీగా మారబోతున్నట్లుగా చెప్పుకొచ్చింది.ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో నిర్మిస్తున్న సినిమా తర్వాత మరిన్ని ప్రాజెక్ట్‌లను నిర్మించబోతున్నట్లుగా కూడా చెప్పుకొచ్చింది.పూరితోనే ఈమె నిర్మాణం ఉంటుందా లేదంటే సొంతంగా కూడా ప్రొడక్షన్‌ హౌస్‌ ఏర్పాటు చేస్తుందా అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు