కుప్పంలో ఏనుగుల బీభత్సంపై చంద్రబాబు స్పందన

చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ వలనే జనావాసాల్లోకి ఏనుగులు వస్తున్నాయని తెలిపారు.

ఈ మేరకు ఏనుగుల దాడి నుంచి ప్రజలను కాపాడాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు చంద్రబాబు లేఖ రాశారు.అలాగే కుప్పంలో ఏనుగుల దాడులతో పాటు ప్రజల కష్టాలపై చర్యలు తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

తాజాగా నూలుకుంటలో ఏనుగుల గుంపు చేసిన దాడిలో ఓ రైతు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.కాగా రైతు సిద్ధప్ప ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్న విషయం తెలిసిందే.

వైరల్ వీడియో : ఒకరినొకరు చెప్పుతో కొట్టుకున్న టీచర్స్..
Advertisement

తాజా వార్తలు