పోలవరం పురోగతిపై సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించారు.కేంద్ర జలశక్తి నివేదిక ప్రకారం ఏడాదిలో 0.83 శాతం పనులు మాత్రమే జరగడంపై చంద్రబాబు ట్వీట్ చేశారు.
కేంద్ర జలశక్తి శాఖ నివేదికపై సీఎం జగన్ సమాధానం చెప్పగలరా అని చంద్రబాబు ప్రశ్నించారు.
విధ్వంస కారులకు విధానం ఏముంటుందని నిలదీశారు.ఇదేం కర్మ మన రాష్ట్రానికి అని ప్రజలు సరిపెట్టుకోవాలా అని ప్రశ్నించారు.
కూల్చేవారికి కట్టడం ఎలా తెలుస్తుందంటూ చంద్రబాబు ట్వీట్ లో పేర్కొన్నారు.