చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం: మంత్రి రోజా

డేటా చోరీ వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని మంత్రి రోజా అన్నారు.డేటా దొంగ డేరాబాబా కన్నా డేంజరస్ అన్న ఆమె.

ప్రజల డేటాను సేవా మిత్ర ద్వారా టీడీపీ చౌర్యం చేసిందని వ్యాఖ్యనించారు.ఈ క్రమంలో చంద్రబాబు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోకపోతే జీవితాంతం జైల్లోనే ఉండాలన్నారు.

ఫోన్ ట్యాపింగ్ తో 23 మందిని బ్లాక్ మెయిల్ చేసి వారి పార్టీలో చేర్చుకున్నారని రోజా ఆరోపించారు.పెళ్లి కానుకతో ఎక్కువ మేలు చేసిందని సీఎం జగనేనని పేర్కొన్నారు.

చంద్రన్న కానుకల పేరుతో దోచుకున్నారన్న ఆమె.అమ్ముడుపోని నెయ్యిని ఆ పథకంలో చేర్చారని విమర్శించారు.40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఎప్పుడైనా అమ్మఒడి ఆలోచన చేశారా అని ప్రశ్నించారు.ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలను మెంటల్ ఆస్పత్రిలో చేర్చేందుకు జనం ఉత్సాహంగా ఉన్నారని రోజా ఎద్దేవా చేశారు.

Advertisement
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

తాజా వార్తలు