చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు..: మాజీమంత్రి వెల్లంపల్లి

టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఏపీలో చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదని చెప్పారు.

చంద్రబాబు పొత్తులు లేకుండా ఎప్పుడూ ఎన్నికలకు వెళ్లలేదని విమర్శించారు.ఏపీకి ప్రత్యేక హోదా వద్దన్న చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తారని వెల్లంపల్లి ప్రశ్నించారు.

చంద్రబాబు మాయమాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే రాష్ట్రంలో త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే ప్రజల్లోకి వెళ్తుందని స్పష్టం చేశారు.

అదేవిధంగా మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
నిరుపేద కుటుంబానికి తన వంతు సహాయం చేసిన పల్లవి ప్రశాంత్.. ఏం చేశారంటే?

తాజా వార్తలు