ఏపీలో రెండో రోజు కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష

ఏపీలో కేంద్ర ఎన్నికల అధికారుల బృందం పర్యటన కొనసాగుతోంది.ఈ క్రమంలో ఇవాళ కూడా ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహించనుంది.

ఈ మేరకు విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో ఈసీ కీలక సమావేశం ఏర్పాటు చేయనుంది.ఇందులో ఎనిమిది జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల సంఘం నిర్వహించనున్న ఈ భేటీలో సీఎస్ జవహార్ రెడ్డి, డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి హాజరుకానున్నారు.

ఈ క్రమంలోనే జిల్లాల వారీగా కలెక్టర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.తరువాత ఎన్నికల సన్నద్ధతపై అధికారులకు ఈసీ దిశానిర్దేశం చేయనుంది.

ఏంటి హార్దిక్ అంత సింపుల్ గా ఆడేసావ్.. 'నో లుక్ షాట్' వైరల్
Advertisement

తాజా వార్తలు