CBSE Exams : నేటి నుంచి సీబీఎస్సీ టెన్త్, ఇంటర్ పరీక్షలు..!

ఢిల్లీలో సీబీఎస్సీ( CBSE ) పదో తరగతి మరియు ఇంటర్ పరీక్షలు ఇవాళ్టి నుంచి జరగనున్నాయి.మరోవైపు రైతుల నిరసనల( Farmers Protest ) నేపథ్యంలో ఢిల్లీలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి.

 Cbse Tenth And Inter Exams From Today-TeluguStop.com

దీంతో విద్యార్థులు కాస్త ముందుగానే పరీక్షలకు హాజరవుతున్నారు.కాగా రైతుల ఆందోళనలతో ఇప్పటికే సీబీఎస్సీ విద్యార్థులకు( CBSE Students ) అడ్వయిజరీ జారీ చేసింది.

ఈ క్రమంలోనే విద్యార్థులంతా పరీక్షలకు హాజరు కావాల్సిందేనని సీబీఎస్సీ పేర్కొంది.ఉదయం 10.30 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా

అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్న సీబీఎస్సీ ఆదేశాల మేరకు విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు( Exam Centers ) చేరుకున్నారు.ఉదయం 10 గంటల తరువాత వచ్చిన విద్యార్థులకు సీబీఎస్సీ అనుమతి నిరాకరించింది.పోలీస్ ఆంక్షల నేపథ్యంలో మెట్రో రైలును విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించింది.కాగా ఈ ఏడాది ఢిల్లీలో మొత్తం 877 పరీక్షా కేంద్రాలను సీబీఎస్సీ ఏర్పాటు చేసింది.ఈ క్రమంలో సుమారు 5 లక్షల 80 వేల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube