సీబీఐ నకిలీ అధికారి కొవ్విరెడ్డి శ్రీనివాస్ కు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.ఈ మేరకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు డిసెంబర్ 16 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కొవ్విరెడ్డి శ్రీనివాస్ ను పోలీస్ కస్టడీకి పొడిగించాలని సీబీఐ కోర్టును కోరగా అందుకు కోర్టు నిరాకరించింది.కాగా సీబీఐ అధికారి ముసుగులో పలువురు ప్రముఖులను కొవ్విరెడ్డి శ్రీనివాస్ మోసం చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసుపై విచారణ చేస్తున్న సీబీఐ కొవ్విరెడ్డి శ్రీనివాస్ కాల్ డేటాను పరిశీలిస్తున్నట్లు తెలిపింది.ఎంతమందిని ఆయన మోసం చేశారో తేల్చాల్సి ఉందని పేర్కొన్నారు.
కోర్టు ఆదేశాలతో ఆయనను తీహార్ జైలుకు తరలించనున్నారు.