సాధారణంగా చలికాలంలో సీతాఫలాలు( Cantaloupe ) పండుతుంటాయి.కానీ ఇప్పుడే సీతాఫలాలు హైదరాబాద్లో కొనుగోలు చేయడానికి అందుబాటులోకి వచ్చాయి.
ఈ పండ్లను వనపర్తి, మహబూబ్ నగర్, మెదక్, సిద్దిపేట, భువనిగిరి, యాదాద్రి, నల్గొండలోని కొండ ప్రాంతాలలో సేకరిస్తున్నారు.వీటిని తెలుగు రాష్ట్రాలలోని వ్యాపారులు మాత్రమే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన వ్యాపారులు సైతం కొంటున్నారు.
ఎందుకంటే ఆ రాష్ట్రాల్లో సీతాఫలాలకి చాలా అధిక స్థాయిలో డిమాండ్ ఉంటుంది.

గిరిజనుల నుంచి తెచ్చిన పండ్లను పురానాపూల్, తాడ్బన్, ఎర్రగడ్డ, మెహదీపట్నం, చాదర్ఘాట్, ఎల్బీనగర్, ఫలక్నుమా వంటి ప్రాంతాల్లోని చిరు వ్యాపారులు అమ్మడం స్టార్ట్ చేశారు.నగరవాసులు వీటి రుచికి ఫిదా అయిపోతున్నారు.ఇక గిరిజనులు అడవిలోకి వెళ్లి చాలా రుచికరమైన సీతాఫలాలను తెచ్చి వ్యాపారులకు అమ్ముతుంటారు.ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఒక కేజీ సీతాఫలాలు రూ.200 నుంచి రూ.300 ధరలలో విక్రయిస్తున్నారు.సీతాఫలం సీజన్ నవంబర్ నెల వరకు కొనసాగుతుంది కాబట్టి ఈసారి ఈ టేస్టీ ఫ్రూట్స్ చాలా రోజులు ఆస్వాదించవచ్చని చెప్పవచ్చు.
ఇక హైబ్రిడ్ సీతాఫలాల కంటే అడవి సీతాఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అని అంటారు.ఎలాంటి హానికరమైన రసాయనాలు లేదా పెస్టిసైడ్స్ వినియోగించకుండా అడవి సీతాఫలాలు పండ్లు పండుతాయి కాబట్టి ఇవి పూర్తిగా ఆరోగ్యకరమని చెప్పవచ్చు.

సీతాఫలాలు పండ్లు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.వీటిలో విటమిన్ సి, ( Vitamin C )విటమిన్ ఏ, ఫైబర్ కంటెంట్ సమృద్ధిగా ఉంటాయి.ఇవి రోగనిరోధక శక్తిని ( Immunity booster )పెంచడంలో, క్యాన్సర్ను ( Cancer )నివారించడంలో, కళ్ళు, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.మీరు సీతాఫలాలు పండ్లను ప్రయత్నించాలనుకుంటే, హైదరాబాద్లోని అనేక మార్కెట్లలో వాటిని కనుగొనవచ్చు.







