బంపర్ ఆఫర్: కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే ఆ రెస్టారెంట్ లో భారీ డిస్కౌంట్..!

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు కరోనా వాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

ఇప్పటికే వివిధ దేశాలలో కరోనా వాక్సిన్ అందుబాటులోకి తీసుకొని వచ్చారు.

ఈ తరుణంలో అనేక దేశాలలో కూడా వ్యాక్సిన్ ను అక్కడి ప్రజలకు అందచేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.ఇదిలా ఉండగా వ్యాక్సిన్ తీసుకున్న కొంతమందిలో చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉండడంతో అధికారులు వ్యాక్సిన్ ను సామాన్య ప్రజలకు అందించడానికి కాస్త సందేహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటివరకు యూఏఈ దేశంలో మొత్తం 27 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ అందజేశారు.నిరంతరంగా కరోనా వ్యాక్సిన్ అందించేందుకు  యూఏఈ  ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఆదేశం ప్రభుత్వం పేర్కొంటోంది.

అంతేకాకుండా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకోవడంతో పాటు అందరికీ వాక్సిన్ ను అందజేసేందుకు ముందుంది.

Advertisement

యూఏఈ ప్రభుత్వానికి కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా ముందు అడుగు వేసి సహాయాన్ని అందచేస్తున్నాయి.ఈ తరుణంలో దుబాయిలోని బాబ్ ఆల్ షామ్స్ అనే రెస్టారెంట్ కస్టమర్స్ కోసం ఒక బంపర్ ఆఫర్ ను ప్రకటించింది.కరోనా వాక్సిన్ వేయించుకున్న వారికీ వారి రెస్టారెంట్ లో అన్ని విభాగాలలో 25% ఆఫర్ ఇస్తున్నట్లు తెలియజేసింది.

ఈ ఆఫర్ కేవలం ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉంటున్నట్లు రెస్టారెంట్ యజమాన్యం వారు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు