కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి

సూర్యాపేట జిల్లా: తిరుమలగిరి పట్టణంలో కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ నాయకులు తరిమితరిమి కొట్టడంతో పట్టణ కేంద్రం రణరంగంగా మారింది.మంగళవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తిరుమలగిరి పట్టణ తెలంగాణ చౌరస్తా వద్ద సీఎం కేసీఆర్,కేటీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయడానికి వస్తున్న కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు ఎల్సూజి నరేష్,పాలకుర్తి రాజయ్య,గంట అమరేందర్ రెడ్డిలను అక్కడే మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకల్లో ఉన్న బీఆర్ఎస్ నాయకులు

 Brs Workers Attacked Congress Workers,brs Workers ,congress Workers, Minister Ja-TeluguStop.com

మంత్రి జన్మదినం చేస్తుంటే దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తారా అనుకున్నారేమో కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను దొరికిన వారికి దొరికినట్లు ఉరికించి కొట్టారు.

దీనితో తెలంగాణ చౌరస్తా రణరంగమై ఏం జరుగుతుందో తెలియక ప్రజలు,ప్రయాణికులు భయాందోళన చెందుతూ పరుగులు తీశారు.ఇంత జరుగుతున్నా అక్కడే ఉన్న పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషించారని కాంగ్రెస్ నాయకుల ఆరోపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube