Jupally Krishna Rao : త్వరలోనే బీఆర్ఎస్ ఖాళీ..: మంత్రి జూపల్లి

తెలంగాణలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పంటలను నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు( Jupally Krishna Rao ) తెలిపారు.ఈ మేరకు ఎకరాకు రూ.10 వేల చొప్పున నష్ట పరిహారం అందిస్తామని చెప్పారు.పంట నష్టంపై ప్రతి గ్రామానికి అధికారులు వెళ్లి సర్వే చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

 Brs Empty Soon Minister Jupalli-TeluguStop.com

ఈ నేపథ్యంలో అధికారుల నుంచి నివేదిక రాగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని మంత్రి జూపల్లి తెలిపారు.వచ్చే ఖరీఫ్ నుంచి క్రాప్ ఇన్సూరెన్స్( Crop Insurance ) అమలు చేస్తామన్నారు.

ప్రీమియం పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందన్న మంత్రి జూపల్లి రూ.2 లక్షల రుణమాఫీని ఒకేసారి చేయాలని ప్రభుత్వం చూస్తుందని తెలిపారు.ఓటమిని జీర్ణంచుకోలేక బీఆర్ఎస్( BRS ) నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.ఈ క్రమంలోనే త్వరలోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube