ఎయిర్ హోస్టర్స్ కి నా చేత కాళ్లు మొక్కించారు.. బ్రహ్మానందం కామెంట్స్ వైరల్!

అక్టోబర్ ఒకటవ తేదీ అల్లు రామలింగయ్య శత జయంతి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి ఈ క్రమంలోనే హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా పలువురు శని సెలబ్రిటీలు సందడి చేశారు.

ఈ సందర్భంగా సీనియర్ కమెడియన్ బ్రహ్మానందానికి సన్మానం జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా బ్రహ్మానందం మాట్లాడుతూ అల్లు రామలింగయ్యతోను అలాగే అల్లు అరవింద్, చిరంజీవి గారితో తనకున్న అనుబంధం గురించి బ్రహ్మానందం గుర్తు చేసుకున్నారు.ఈ సందర్భంగా బ్రహ్మానందం అల్లు రామలింగయ్య గురించి మాట్లాడుతూ ఆయన ఏ విషయాన్ని అయినా చాలా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకునే వ్యక్తిత్వం అంటూ అల్లు రామలింగయ్య గురించి మాట్లాడటమే కాకుండా ఆయనతో పనిచేసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

ఇక బ్రహ్మానందం చిరంజీవి గురించి మాట్లాడుతూ తన కెరియర్ మొదట్లో జరిగిన ఒక సంఘటనని గుర్తు చేసుకున్నారు.కెరియర్ మొదట్లో జంధ్యాల గారు నన్ను చిరంజీవికి పరిచయం చేశారు ఇలా తనతో పరిచయం ఏర్పడిన తర్వాత వారితో కలిసి నేను మొదటిసారి విమాన ప్రయాణం చేస్తున్నామని తెలిపారు.

ఇలా చిరంజీవి గారితో కలిసి ఎయిర్ పోర్టుకు వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు నన్ను పిచ్చివాడు అని పరిచయం చేసి తనని ఆటపట్టించారని బ్రహ్మానందం గుర్తు చేసుకున్నారు.ఇక విమానం ఎక్కేముందు అక్కడ కొంతమంది అమ్మాయిలు ఉంటారు వాళ్లు కాళ్లకు మొక్కి మనం లోపలికి వెళ్లాల్సి ఉంటుందని చిరంజీవి నాతో చెప్పారు.అది నిజమే అనుకోని నేను విమానం ఎక్కగానే అక్కడ ఉన్నటువంటి ఎయిర్ హోస్టర్స్ కాళ్లకు మొక్కగానే వాళ్ళు ఒక్కసారిగా వెనక్కి వెళ్లారు.

Advertisement

ఇలా నన్ను ఆట పట్టించడం కోసం ఎయిర్ హాస్టర్స్ కాళ్లకు మొక్కించిన మహానుభావుడు చిరంజీవి అంటూ ఈ సందర్భంగా కెరియర్ మొదట్లో జరిగిన సంఘటన గురించి బ్రహ్మానందం చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు