టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ల లిస్టులో ముందుగా వినిపించే పేరు బోయపాటి శ్రీను. ఈయన సినిమాలు తీసే విధానం, అందులో చూపించే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.
ఒక్కో సినిమాకు యాక్షన్ మరీ ఎక్కువ అయ్యి ప్లాప్స్ ఎదురైనా ఈయనకు మాగ్జిమమ్ హిట్ లే వచ్చాయి.ఇటీవలే బోయపాటి శ్రీను బాలయ్యతో అఖండ సినిమా చేసిన విషయం తెలిసిందే.
అఖండ సినిమాతో అఖండ మైన విజయం అందుకుని హ్యాట్రిక్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.ఈ సినిమా విజయం తర్వాత బోయపాటి శ్రీను రామ్ పోతినేని తో సినిమా తీస్తున్నాడు.
ఇప్పటికే వీరి కాంబో అధికారికంగా ప్రకటించారు.ప్రస్తుతం రామ్ లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది.వెంటనే బోయపాటి తో షూట్ లో పాల్గొనబోతున్నాడు రామ్.
తాజాగా వీరి కాంబోలో వచ్చే సినిమాపై లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది.ఈ సినిమా కొన్ని నెలల క్రితం అధికారిక ప్రకటన వచ్చింది.మళ్ళీ ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పలేదు.
మరి తాజాగా వినిపిస్తున్న బజ్ ప్రకారం ఈ సినిమా జూన్ 1న 2022న గ్రాండ్ గా లాంచ్ చేయడానికి సిద్ధం అవుతున్నారట మేకర్స్.దీని గురించి కూడా అధికారిక ప్రకటన త్వరలోనే రాబోతున్నట్టు టాక్ బయటకు వచ్చింది.
ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకి తాత్కాలికంగా #RAPO20 అనే పేరును పెట్టారు.
థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సౌత్ లో భాషలతో పాటుగా హిందీలో కూడా విడుదల కానుంది.మరి ఈ సినిమాతో బోయపాటి రామ్ కు ఎలాంటి హిట్ ఇస్తాడో వేచి చూడాల్సిందే.