మహేష్ బాబు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా అంటున్న అల్లు అర్జున్..ఇలా పగబట్టేసాడు ఏంటి!

2020 సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వార్ ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించిన ‘అలా వైకుంఠపురం లో’, సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) హీరో గా నటించిన ‘సరిలేరు నీకెవ్వరూ‘ చిత్రాలు కేవలం ఒక్క రోజు తేడా తో విడుదల అయ్యాయి.

 Box Office Fight Between Mahesh Babu And Allu Arjun Guntur Kaaram And Pushpa 2,-TeluguStop.com

రెండు సినిమాలకు మంచి టాక్ వచ్చింది, కానీ సంక్రాంతి విజేతగా చివరికి అల్లు అర్జున్ ‘అలా వైకుంఠపురం లో’ చిత్రమే నిలిచింది.ఈ సినిమాకి దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 160 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు సాధించింది.

ఇప్ప్పటికీ కూడా ఈ సినిమా టాలీవుడ్ లో నాన్ రాజమౌళి ఇండస్ట్రీ హిట్ గానే కొనసాగుతుంది.ఇక మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రం దాదాపుగా 130 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు సాధించి ఆల్ టైం టాప్ 5 సినిమాలలో ఒకటిగా నిల్చింది.

అయితే ఈ సినిమా వసూళ్లను రీసెంట్ గానే చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య( Waltair Veerayya )’ సినిమా దాటేసింది.

-Movie

అయితే ఒక్క రోజు తేడా తో విడుదలై క్లోసింగ్ లో అల్లు అర్జున్ కంటే తక్కువ వసూళ్లను రాబట్టిన మహేష్ బాబు పై ఆయన దురాభిమానులు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తూ ఉంటారు.అల్లు అర్జున్ ఫ్యాన్స్ మహేష్ ఫ్యాన్స్ తో గొడవలు అయ్యినప్పుడల్లా ఈ సంఘటనని గుర్తు చేసి వెక్కిరిస్తూ ఉంటారు.అయితే ఈ సినిమా విడుదలకు ముందు అల్లు అర్జున్ మరియు మహేష్ బాబు మధ్య కూడా కోల్డ్ వార్ జరిగిందని అప్పట్లో ఇండస్ట్రీ లో బలంగా వినిపించిన వార్త.

-Movie

ఇది ఇలా ఉండగా మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్న ‘గుంటూరు కారం( Guntur Kaaram )’ అనే చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తారీఖున విడుదల చెయ్యబోతున్నారు.ఫస్ట్ లుక్ అప్పుడే విడుదల తేదీ కూడా ఇచ్చేసారు.ఇక జనవరి 12 వ తేదికి పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం కానీ, లేదా రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రం కానీ విడుదల చేస్తారేమో అని అనుకున్నారు అందరూ.

కానీ ఈ రెండు సినిమాలు కాకుండా, ఇప్పుడు ‘పుష్ప: ది రూల్‘ విడుదల అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.షూటింగ్ శరవేగంగా సాగుతుందని, ముందుగా వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో విడుదల చేద్దామని మేకర్స్ అనుకున్నప్పటికీ షూటింగ్ అనుకున్న సమయం కంటే ముందుగానే అయిపోయే సూచనలు ఎక్కువ కనిపిస్తుండడం వల్ల, సంక్రాంతికి సిద్ధం గా ఉండండి అంటూ తమ బయ్యర్స్ కి చెప్పేశారట ‘మైత్రి మూవీ మేకర్స్‘.అంటే మరో సారి సంక్రాంతికి అల్లు అర్జున్ మరియు మహేష్ బాబు మధ్య భీకరమైన బాక్స్ ఆఫీస్ పోరు జరగబోతుంది అన్నమాట.

ప్రస్తుతానికి అయితే అల్లు అర్జున్ పుష్ప సినిమాకి ఉన్నంత క్రేజ్ , మహేష్ ‘గుంటూరు కారం‘ కి లేదు.రాబొయ్యే రోజుల్లో సమీకరణాలు మారబోతున్నాయా లేదా అనేది చూడాలి.

మరో విషయం ఏమిటంటే ‘గుంటూరు కారం’ సినిమా విడుదల తేదీని తెలుకొనే అల్లు అర్జున్ కావాలని ‘పుష్ప : ది రూల్’ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయిపిస్తున్నాడని, మహేష్ బాబు మీద మనోడికి మామూలు పగలేదనే రూమర్ కూడా సోషల్ మీడియా లో బలంగా వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube