ఈ హీరోయిన్ సినిమా అవకాశాల కోసం ఎలా మారిందో చూడండి....

తెలుగులో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన "చిరుత" అనే చిత్రం ద్వారా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ మరియు బీహార్ బ్యూటీ నేహా శర్మ హీరోహీరోయిన్లుగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయిన సంగతి తెలిసిందే.

అయితే ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వరుస హిట్లు మరియు అవకాశాలు దక్కించుకొని బాగానే రాణిస్తుంటే నేహా శర్మ మాత్రం ఇప్పటికీ సరైన హిట్ లేక కొంతమేర గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది.

అయితే తాజాగా ఈ అమ్మడికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను గనుక ఒకసారి పరిశీలించినట్లయితే అప్పట్లో చిరుత సినిమాలో నటించే సమయంలో మేకప్ లేకుండా తీసుకున్నట్లు తెలుస్తోంది.

దీంతో కొందరు నెటిజన్లు ఈ ఫోటోలను సోషల్ మీడియా మధ్య తెగ ట్రోల్స్ చేస్తున్నారు. అంతే కాక అప్పటికీ ఇప్పటికీ నేహాశర్మ ప్లాస్టిక్ సర్జరీల ద్వారా చాలా మారిపోయిందని అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో నేహా శర్మ కేవలం రెండు చిత్రాల్లో మాత్రమే నటించింది.ఇందులో రామ్ చరణ్ తో నటించిన చిరుత చిత్రం బాక్సాఫీసు వద్ద పర్వాలేదనిపించగా, టాలీవుడ్  యంగ్ హీరో వరుణ్ సందేశ్ తో కలిసి నటించిన "కుర్రాడు" చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.

Advertisement

దీంతో ఇక ఈ అమ్మడు అప్పటి నుంచి తెలుగు సినీ పరిశ్రమకు కొంతమేర దూరంగా ఉంటోంది.  అయితే తమిళం, మలయాళం, కన్నడ, బాలీవుడ్, తదితర భాషల్లో మాత్రం బాగానే అవకాశాలు దక్కించుకుంటోంది.

కానీ ఇప్పటి వరకూ చెప్పుకోవడానికి తన సినీ కెరీర్ లో సరైన హిట్ లేక పోవడంతో కొంత మేర తన ఉనికిని చాటుకునేందుకు సినిమా పరిశ్రమలో తీవ్రంగా శ్రమిస్తుంది.

Advertisement

తాజా వార్తలు