స్విమ్మింగ్ ఫూల్ లో బికినీ వేసిన ఫోటోని షేర్ చేసిన స్టార్ హీరోయిన్...

హిందీ లో "స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్" అనే చిత్రం ద్వారా సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా పరిచయమైన హీరోయిన్ "అలియా భట్" గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే అలియా భట్ ముందుగా సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తన నటనా ప్రతిభను నిరూపించుకుని సొంతంగా సినిమా అవకాశాలు దక్కించుకుంది.

దీంతో ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల సరసన స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది.అయితే అనుకోకుండా ఆ మధ్య బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకొని మరణించడంతో అందుకు పరోక్షంగా అలియా భట్ తండ్రి మహేష్ భట్ కారణమంటూ కొంతమేర ఈ అమ్మడి గురించి సోషల్ మీడియాలో నెగటివ్ గా ట్రోల్ చేశారు.

అయినప్పటికీ అలియా భట్ మాత్రం అవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతోంది.ఈ మధ్య కాలంలో అలియా భట్ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన సినిమా సమాచారం మరియు అందమైన ఫోటోలను ప్రేక్షకులతో పంచుకుంటోంది.

కాగా తాజాగా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అలియా భట్ షేర్ చేసినటువంటి ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది .అయితే ఇంతకీ ఆ ఫోటో ఏమిటంటే ఈ అమ్మడు స్విమ్మింగ్ దుస్తులు ధరించి స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతుండగా తీసిన ఫోటోని షేర్ చేసింది.దీంతో అలియా భట్ అందాల ఆరబోత కి నెటిజన్లు ఫిదా అయ్యారు.

అంతేకాకుండా ఈ ఫోటోని షేర్ చేసిన అతికొద్ది సమయంలోనే దాదాపుగా 20 లక్షల పైచిలుకు మంది లైకులు, కామెంట్లు చేశారు.కాగా ప్రస్తుతం ఈ అమ్మడి అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాను ఇప్పటి వరకు దాదాపు 5 కోట్ల పైచిలుకు మంది ఫాలో అవుతున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అలియా భట్ వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతుంది.తాజాగా ఈ అమ్మడు మెయిన్ లీడ్ పాత్రలో నటించిన "గంగూబాయ్" చిత్ర ట్రైలర్ విడుదల కాగా మంచి స్పందన లభించింది.అలాగే ప్రస్తుతం తెలుగులో ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న "ఆర్ ఆర్ ఆర్" చిత్రంలో సీత పాత్రలో నటిస్తోంది.

ఇటీవలే ఈ అమ్మడికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు.అలాగే బాలీవుడ్ ప్రముఖ హీరోలు అమితాబ్ బచ్చన్ రణబీర్ కపూర్ మరియు టాలీవుడ్ కింగ్ నాగార్జున తదితరులు నటిస్తున్న "బ్రహ్మాస్త్ర" అనే చిత్రంలో కూడా అలియా భట్ కీలక పాత్రలో నటిస్తోంది.

ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తయ్యాయి.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

తాజా వార్తలు