ఒక రోజు ఒక కోటి వృక్షర్చన లో మొక్కలు నాటిన ఎంపిటిసి సంభ బుచ్చమ్మ

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రం( Boinpalli Mandal )లోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిన ఎంపిటిసి.

ఈ సందర్భంగా ఎంపిటిసి మాట్లాడుతూ భారత వజ్రోత్సవాల సందర్భంగా తేలంగాణ రాష్ట్రం కోటి వృక్షార్చన కార్యక్రమం( Crore tree planting program ) చేపట్టిందని తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే హరితహారంతో సస్యస్యామలంగా మారిందని అన్నారు.

ఈకార్యక్రమంలో సర్పంచ్ గుంటి లతా శ్రీ,ఉప సర్పంచ్ పిట్టల మోహన్, బి ఆర్ ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గుంటి శంకర్ నాయకులు సంబ లక్ష్మీరాజం ,వార్డు సభ్యులు వాసాల శ్రీనివాస్, కార్యదర్శి రాజ సులోచన, దూస రామాంజనేయులు ,ఫీల్డ్ అసిస్టెంట్ మహేందర్ తదితరులు ఉన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి

Latest Rajanna Sircilla News