సుశాంత్‌కు విషం పెట్టి చంపేశారు?

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ మృతి పై ఎవరికి తోచినట్లుగా వారు మాట్లాడుతున్నారు.మొదట సుశాంత్‌ ది ఆత్మతహత్య అనుకున్నారు.

కాని ఆయనది హత్య అంటూ కొందరు బలంగా వాదిస్తున్నారు.మరి కొందరు సుశాంత్‌ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం రియా అంటూ కొందరు మరి కొందరు కరణ్‌ జోహార్‌, మహేష్‌ భట్‌, ఆధిత్య చోప్రా వంటి బాలీవుడ్‌ ప్రముఖులు అంటూ వాదిస్తున్నారు.

మొత్తానికి సుశాంత్‌ ఇష్యూ చాలా పెద్దగా మారింది.ఇలాంటి సమయంలో బీజేపీ సీనియర్‌ నాయకుడు ఎంపీ సుబ్రమణ్య స్వామి మరో సంచలన వ్యాఖ్యలు చేశాడు.

సుశాంత్‌పై విష ప్రయోగం జరిగి ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.విషం పెట్టిన విషయం పోస్ట్‌ మార్టంలో తేలకుండా ఉండేందుకు కూడా కొందరు ప్రయత్నించారు అంటూ ఆయన ఆరోపిస్తున్నాడు.

Advertisement

ఈ విషయంలో ఆయన చేస్తున్న ఆరోపణలు నిజం కాకపోవచ్చు కాని సుశాంత్‌ కేసు విషయంలో ఎవరికి వారు ఏదో వ్యాఖ్యలు చేయడంతో అభిమానులు గందరగోళంకు గురి అవుతున్నారు.

సుశాంత్‌ ను ఇంతకు ముందు కుక్క బెల్ట్‌ తో మెడకు బిగించి ఉరి వేసినట్లుగా కొందరు అనుమానించారు.ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించారు అంటున్నారు.మొత్తానికి ఈ కేసును సీబీఐకి సుప్రీం అప్పగించడంతో మొత్తం విషయాలు బయటకు వస్తాయని నమ్మకంగా ఎదురు చూస్తున్నారు.

సుశాంత్‌ చనిపోయి నెలలు గడుస్తున్నా ఇంకా కూడా ఆయన జ్ఞాపకాల్లోనే అభిమానులు ఉన్నారు.దాంతో ఎవరు ఏం చెప్పినా దాన్ని నమ్మేస్తూ సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు.

భర్తతో దిగిన ఫోటోలను డిలీట్ చేయాలని కోరిన కత్రినా కైఫ్.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు