విజయవాడ లో బీజేపీ నేత కిడ్నాప్ కలకలం..!!

విజయవాడలో భర్త ని కిడ్నాప్ చేశారంటూ మహిళ కలకలం సృష్టించింది.

తన భర్త ని కిడ్నాప్ చేశారంటూ ఓ మహిళ పెనమలూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది.

తాడిగడప లో బీజేపీ ప్రముఖ నాయకుడు కిడ్నాప్ గురైనట్లు వార్తలు వస్తున్నాయి.తన భర్తను కావాలని కిడ్నాప్ చేసినట్లు సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందట.

నెల్లూరు జిల్లా బిజెపి పార్లమెంటరీ సెక్రెటరీగా రాణిస్తున్న వినోద్ మూడు రోజుల క్రితం.బంధువుల ఇంటికి వెళ్లారు.

ఈ క్రమంలో సాయంత్రం వాకింగ్ కి వెళ్ళిన వినోద్ నీ.కొంతమంది దుండగులు కిడ్నాప్ చేసినట్లు..

Advertisement

భార్య ఆరోపణలు చేస్తోంది.వ్యాపారంలో కొంత మంది తో విభేదాలు ఉన్నట్లు వారే తన భర్తను కిడ్నాప్ చేసినట్లు మహిళ అనుమానం వ్యక్తం చేస్తోంది.

నెల్లూరు నుండి విజయవాడ ప్రాంతానికి చుట్టాల వద్దకు వచ్చిన బిజెపి నేత కిడ్నాప్ అయినట్టు వార్త రావడంతో .ఈ న్యూస్ ఏపీ రాష్ట్ర బీజేపీలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు