ముస్తాబాద్ మండలంలో బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కన్వీనర్ అన్నమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల కేంద్రంలోని స్వామి వివేకానంద విగ్రహం వద్ద స్వచ్ఛభారత్ నిర్వహించి, మండల కేంద్రంలోని మహనీయుల విగ్రహాలను నీటితో శుభ్రంగా కడిగి పూలమాలలు వేసి వారిని స్మరించుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో కమిటీలు ఏర్పాటు చేసి స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన విస్తరింప చేయాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు.

బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో ప్రజాస్వామ్య పద్దతిలో రాజ్యాంగబద్ధంగా బిజెపి పార్టీ తప్పకుండా గెలుస్తుందని మండల శాఖ నాయకులు అన్నారు.

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు కార్తీక్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కోల కృష్ణ గౌడ్,పట్టణ అధ్యక్షుడు మెంగని మహేందర్,కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు వరి వెంకటేష్,నియోజకవర్గం కన్వీనర్ కరెడ్ల మల్లారెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి సంతోష్ రెడ్డి,గోపి,చిగురు వెంకన్న,సీనియర్ నాయకులు మీస శంకర్,ఉపేంద్ర,దేవేందర్, సత్యం బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి
Advertisement

Latest Rajanna Sircilla News